నాకు దానికి ఏ సంబంధం లేదు: స్మగ్లింగ్ వార్తలపై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ

by Disha Web Desk 6 |
నాకు దానికి ఏ సంబంధం లేదు: స్మగ్లింగ్ వార్తలపై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టీవీ షో జబర్దస్త్ కమెడియన్ హరిబాబు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో కీలక పాత్రధారిగా మారారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో అటవీశాఖ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసులను చూసి హరి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ప్రస్తుతం జబర్థస్త్‌లో లేడీ గెటప్స్‌ చేస్తున్న గంపా హరికృష్ణను.. పరారీలో ఉన్న హరిబాబుగా మీడియా.. సోషల్‌ మీడియా భావించింది. దీంతో కొంత మంది నెటిజన్లు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా, దీనిపై గంపా హరికృష్ణ మీడియా ముఖంగా స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘నాకు గంజాయ్ స్మగ్లింగ్‌కు ఎటువంటి సంబంధం లేదు. 2013లో షకలక శంకర్‌ అన్న టీమ్‌లో వైఎస్‌ హరిబాబు పని చేశాడు. తర్వాత అతడు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులో దొరికాడు. పోలీసుల ఎంక్వైరీలో అతడు జబర్థస్త్‌ చేసినట్లు కూడా తేలింది. నేను అప్పటికే ఫేమ్‌లో ఉన్నాను. గూగుల్‌లో ఆ పేరు కొడితే నా ఫొటోలు వస్తున్నాయి. మీడియా వాళ్లు గూగుల్‌లో ఆ పేరు కొట్టి.. నా ఫొటోలు తీసుకుంటున్నారు. ఎందుకు రాశారో తెలీదు.. కొన్ని ప్రముఖ ఛానల్స్‌ కూడా నా ఫొటోలు పెట్టి వార్తలు రాశాయి. దీని వల్ల నేను చాలా అంటే చాలా సఫర్‌ అవుతున్నాను. నాకు దానికి సంబంధం లేదు. నాది నూజివీడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు హరికృష్ణ.

Also Read: Sai Dharam Tej : ‘నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది’’ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

Breaking: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్ హరి

Next Story

Most Viewed